సాగర్ ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కుటుంబాన్ని పరామర్శించిన జానారెడ్డి
By: Sankar Fri, 11 Dec 2020 3:03 PM
ఇటీవల మృతిచెందిన నాగార్జున సాగర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ నేడు పరామర్శించారు.
ఛాతినొప్పి అని చెప్పడంతో నోముల నర్సింహయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఈ నెల 1వ తేదీన నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తెల్లవారుజామున 5.30కి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు.
ఇక నోముల మృతితో ఖాళీ అయిన సాగర్ అసెంబ్లీ కి ఉప ఎన్నిక జరగనుంది ..దీనితో ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి అనడంలో సందేహం లేదు..ఇప్పటికే జానా రెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే జానారెడ్డి మాత్రం ఆ వార్తలను ఖండించారు...
Tags :
congress |
visits |