Advertisement

  • పీసీసీ చీఫ్ పదవి బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలి ..విహెచ్ సంచలన వ్యాఖ్యలు

పీసీసీ చీఫ్ పదవి బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలి ..విహెచ్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Wed, 11 Nov 2020 7:51 PM

పీసీసీ చీఫ్ పదవి బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలి ..విహెచ్ సంచలన వ్యాఖ్యలు


ఖమ్మం జిల్లాలో ఈరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు పొలికేక సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో వీహెచ్ హనుమంతరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని బడుగు బలహీన వర్గాల వారికీ ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లగలుగుతుందని అన్నారు.

వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ కు అనుకూలంగా సభలో నినాదాలు చేస్తున్నా, వీహెచ్ వెనక్కి తగ్గలేదు.

బడుగు బలహీన వర్గాలవారికి అధ్యక్ష పదవిని ఇస్తేనే రాష్ట్రంలో పార్టీ బతికి బట్టకడుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వీహెచ్ పేర్కొన్నారు.

Tags :

Advertisement