కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుకు కరోనా
By: Sankar Sun, 21 June 2020 10:07 AM
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది ..గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా రాజకీయనాయకులకు కూడా కరోనా సోకడంతో అందరూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు ..ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా కరోనా టెస్ట్ లు చేసే అవకాశం ఇవ్వడంతో కేసుల సంఖ్య మరింత పేరుగుతుంది..తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కరోనా వైరస్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వంద మందికి దుప్పట్ల పంపిణీ చేశారు.
అదే రోజు నుంచి జ్వరంతో బాధపడుతున్న కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.మరోవైపు కరోనా కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎంతో మంది ప్రజలకు వీహెచ్ అండగా నిలిచారు. లాక్డౌన్ కాలంలోనూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఎప్పుడు కాంగ్రెస్ పాటిలో దీటైన లీడర్గా ప్రతి ఒక్క ప్రజాసమస్యపై పోరాటం చేసే హనుమంత్ రావు లాంటి నాయకుడు కరోనా బారిన పడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులూ ఆందోళనలో ఉన్నారు ..అయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు ..
కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బీగాల గణేష్ గుప్తాలకు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్నారు.అయితే హనుమంత్ రావు ఇటీవల పాల్గొన్న కార్యక్రమాలపై అధికారులు ద్రుష్టి సారించి ఎవరెవరితో కాలియాశారో వెతికే పనిలో పడ్డారు ..ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు