Advertisement

  • యూపీఏ చైర్మన్ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

యూపీఏ చైర్మన్ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

By: Sankar Mon, 28 Dec 2020 2:25 PM

యూపీఏ చైర్మన్ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం


యూపీఏ చైర్మన్ పదవిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీస సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ... అదేమీ ప్రధానమంత్రి పోస్ట్ కాదని వ్యాఖ్యానించారు. యూపీఏ చైర్మన్ పదవిని చేపట్టాలన్న ఆలోచన శరద్ పవార్‌కూ లేదని ప్రకటించారు.

అదేమీ ప్రధాని పోస్ట్ కాదు. యూపీఏ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాలన్న ఆలోచన శరద్ పవార్‌కూ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు అలాంటి ప్రతిపాదనే లేదు. అని చిదంబరం పేర్కొన్నారు. యూపీఏ భాగస్వామి పక్షాల సమావేశంపై స్పందిస్తూ... సహజంగా యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం సందర్భంగా... సహజంగానే అందరికీ ఆహ్వానాలు వెళ్తాయి.

ఈ సమావేశానికి అత్యంత పెద్ద పార్టీగా ఉన్న పార్టీ నాయకుడే అధ్యక్షత వహిస్తారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షత వహించడం సహజంగానే జరిగే ప్రక్రియ.’’ అని చిదంబరం పేర్కొన్నారు....

Tags :
|
|

Advertisement