కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం
By: Sankar Sun, 15 Nov 2020 7:50 PM
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత నెల ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అనంతరం పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
ప్రస్తుతం ఆయన గురుగావ్లోని మేదాంత ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని చెప్పారు.
మరోవైపు అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కోలుకుని అరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. అహ్మద్ పటేల్కు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా పేరుంది.