Advertisement

  • స్వల్ప అస్వస్ధతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

స్వల్ప అస్వస్ధతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

By: Sankar Thu, 30 July 2020 10:39 PM

స్వల్ప అస్వస్ధతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ



కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను సర్ గంగా రామ్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని దవాఖాన వర్గాలు ధ్రువీకరించాయి. "సాధారణ వైద్య పరీక్షల" నిమిత్తం సోనియాగాంధీ గురువారం రాత్రి 7 గంటల సమయంలో చేర్చినట్లు మెడికల్ బులెటిన్ లో సర్ గంగారామ్ దవాఖాన తెలిపింది.

"ఆమెను సాధారణ పరీక్షలు, పరిశోధనల కోసం చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉంది" అని దవాఖాన చైర్మన్ డాక్టర్ డీఎస్ రానా చెప్పారు. గతంలో అనారోగ్యానికి గురైన సోనియాగాంధీ విదేశాల్లో వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన సంగతి తెలిసిందే. కడుపు నొప్పి కారణంగా ఆ సమయంలో ఆమె ఆస్పత్రిలో చేరారు.


Tags :

Advertisement