Advertisement

  • నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By: chandrasekar Sat, 28 Nov 2020 6:07 PM

నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


పలువురు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మోదీ పర్యటనకు సంబంధించి స్థానిక ఎంపీనైన తనకు ఆహ్వానం కానీ, సమాచారం కానీ లేకపోవడం శోచనీయమని అన్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం మోదీ హైదరాబాద్ వస్తున్నారన్నారు. హకీంపేట ఎయిర్‌పోర్టుకు ముందుగా ఆయన చేరుకున్నారు. అయితే హకీంపేట మల్కాజ్ గిరి నియోజకవర్గ పరధిలోనే ఉన్నా తనకు ప్రధాని పర్యటనకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టును లోక్‌సభ స్పీకర్‌తో పాటు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీతో పాటు పలు మీడియా సంస్థలకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. మరోవైపు ఇదే విషయమై మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధాని పర్యటన వ్యక్తిగతం కాదు. బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదన్నారు రేవంత్. ఇది ప్రజాప్రతినిధిని తీవ్రంగా అవమానించడమే అన్నారు. ఇది ప్రొటోకాల్‌ ఉల్లంఘన, సంప్రదాయాలకు విరుద్ధమని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి తన నిరసన తెలియజేస్తానన్నారు రేవంత్ రెడ్డి. లోక్‌సభ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Advertisement