Advertisement

  • ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

By: Sankar Thu, 31 Dec 2020 11:46 AM

ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి


కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిశారు.

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రమంత్రికి కోమటిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎల్‌బీ నగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు

ఎన్‌హెచ్‌– 365పై నకిరేకల్‌ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయినందు న, అందులోనే అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణం విస్తరిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో జాతీ య రహదారి 167పై అలీనగర్‌ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :
|

Advertisement