ఎల్ఆర్ఎస్ స్కీం ప్రజలకు గుదిబండలాగా మారింది ...కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
By: Sankar Tue, 15 Dec 2020 5:43 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి... మూడు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించిన ఆయన.. సీఎం కేసీఆర్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు..
కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. తక్షణమే పాత విధానం ప్రకారమే రిజిస్ట్రేషన్ లు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రజలకు గుదిబండలా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. తక్షమే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని.. లేని పక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ప్రజా ఉద్యమంతో ప్రగతిభవన్ గాడిలను బద్దలు కొడుతామని వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ.. ఇకనైనా ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించాలి.. లేకపోతే కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు.