కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా
By: chandrasekar Thu, 17 Dec 2020 1:16 PM
కాంగ్రెస్ పార్టీ కీలక
నేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్
కాంగ్రెస్ పార్టీ కీలక నేత సువెందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా
చేశారు. త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సువెందు
బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
సువెందు గత కొ్న్ని
రోజులుగా తృణమూల్ కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ
కార్యక్రమానికి హాజరైనా పార్టీ గుర్తింపు చిహ్నాలు లేకుండానే వస్తున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సువెందు బీజేపీలో చేరబోతున్నారని
ప్రచారం జరుగుతున్నది.
నవంబర్ 27న
సువెందు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి
కూడా రాజీనామా చేసారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వార౦లో బెంగాల్ పర్యటన సందర్భంగా
ఆయన బీజేపీకి మారె అవకాశం ఉందని తెలుస్తోంది.