Advertisement

  • హరీష్ రావు మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హరీష్ రావు మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

By: Sankar Tue, 14 July 2020 8:58 PM

హరీష్ రావు మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి



ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే చనిపోతామని ప్రజలు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. సంగారెడ్డిలో ఇటీవలే టోపి బాబా అనే వ్యక్తి చనిపోయారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సమయంలో ప్రజలకు ఇతర జబ్బులు వచ్చినా అనుమానాలతో ప్రైవేటు ఆస్పత్రులు చేర్పించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తానే మంత్రిగా ఉండి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో మంచం వేసుకుని ఉండేవాడినని జగ్గారెడ్డి చెప్పారు. ఈ కష్ట కాలంలో తాను రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలే లక్ష్యంగా తాను మాట్లాడుతున్నానని అన్నారు. తన వ్యూహాలు తనకు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో వాటిని అమలు పరుస్తూ తన ఆట తాను ఆడతానని వ్యాఖ్యానించారు.

మంత్రి హరీశ్‌రావుపైనా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. సంగారెడ్డికి వచ్చి కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం కాదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో నమ్మకం కలిగించాలని అన్నారు. ‘‘కరోనా పేరు మీద సంగారెడ్డికి వచ్చి కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.

Tags :
|

Advertisement