Advertisement

కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి...

By: chandrasekar Wed, 25 Nov 2020 2:57 PM

కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి...


వివిధ పార్టీల నుంచి సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వేలాది మంది టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరుతున్నారు.

తాజాగా జిల్లాలోని సూరారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు (జిమ్‌ వేణు) తన అనుచరులతో కలిసి మంగళవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.

రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags :
|
|
|

Advertisement