Advertisement

  • బీజేపీ ఆఫీస్ వైపుకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు , రేవంత్ రెడ్డి

బీజేపీ ఆఫీస్ వైపుకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు , రేవంత్ రెడ్డి

By: Sankar Thu, 01 Oct 2020 7:18 PM

బీజేపీ ఆఫీస్ వైపుకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు , రేవంత్ రెడ్డి


తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డిలు బీజేపీ ఆఫీస్ వైపు దూసుకువచ్చారు.

గృహకల్ప ఆఫీస్ వద్ద రోడ్డుపై రేవంత్ రెడ్డి భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు దూసుకు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

యూపీలో యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ హత్రాస్ కు బయలుదేరి వెళ్ళాడు. అయితే, హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎవర్ని అనుమతించడం లేదని పోలీసులు హెచ్చరించారు. రాహుల్ గాంధీని యమునా ఎక్స్ ప్రెస్ హైవే పైనే అడ్డుకొని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement