కాంగ్రెస్ సీనియర్ నేత , విపక్ష నాయకుడు గులాం నబి ఆజాద్ కు కరోనా పాజిటివ్
By: Sankar Fri, 16 Oct 2020 4:40 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. శుక్రవారం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ వచ్చింది.
‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్లో ఉంటున్న. గత కొన్నిరోజులుగా నన్ను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్ష చేయించుకొని క్వారంటైన్లో ఉండాలి’ అని ట్విట్టర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా కొద్దిరోజుల కిత్రమే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అహ్మాద్ పటేల్తోపాటు మోతీలాల్ వోరా, అభిషేక్ సంఘ్వీ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. వీరిలో సంఘ్వీ ఇప్పటికే కోలుకోగా మిగిలిన వారు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వరుసగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరోనా బారినపడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.