Advertisement

  • రెండు వర్గాల మధ్య వాగ్వాదం చిలికి చిలికి ఘర్షణకు దారితీసిన వైనం

రెండు వర్గాల మధ్య వాగ్వాదం చిలికి చిలికి ఘర్షణకు దారితీసిన వైనం

By: chandrasekar Fri, 28 Aug 2020 3:14 PM

రెండు వర్గాల మధ్య వాగ్వాదం చిలికి చిలికి ఘర్షణకు దారితీసిన వైనం


గ్రామంలో మీ వల్లే కరోనా వచ్చిందని రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలయ్యింది. పరస్పరం ఇళ్లలోకి వెళ్లి మరీ దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలపాలైయ్యారు. ఇరు వర్గాల వారు చింతకాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం పిర్యాదులు చేసారూ. రెండు కులాలకు చెందిన ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చిలికి చిలికి ఘర్షణగా మారింది.

కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా నిన్న ఖర్మ కార్యక్రమం జరిగింది. అక్కడికి మరో కులం వ్యక్తి వెళ్లాడు. కరోనా వచ్చిన వ్యక్తి బయటకు ఎందుకు వచ్చావు అని కోపంగా అనడం వాగ్వాదానికి దారితీసింది. మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చిందంటే.. కాదు.. మీ వారి వల్లే వచ్చిందని ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా.. కోపంతో మందిని కూడగట్టుకుని ఇంటిపైకి వెల్లి దాడి చేయడంతో.. చిలికి చిలికి గాలి వానలా ఘర్షణకు దారి తీసింది.

వీధుల్లోకి ఈడ్చుకుని వచ్చి కొట్టుకున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించారు. పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement