Advertisement

జేసీ ప్రభాకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్

By: chandrasekar Thu, 20 Aug 2020 1:03 PM

జేసీ ప్రభాకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్


అనంతపురం కోర్టు తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కడప జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది.

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కరోనా నిబంధనల మేరకు వాహనాల ర్యాలీకి ఓ పోలీస్ ఉన్నతాధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మరుసటి రోజే కడప జైలుకు తరలించారు.

కాగా, మంగళవారం కడప జైల్లో ఉన్న ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 317 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు.

Tags :
|

Advertisement