Advertisement

మాజీ మంత్రికి కండిషన్ బెయిల్

By: chandrasekar Tue, 25 Aug 2020 6:02 PM

మాజీ మంత్రికి కండిషన్ బెయిల్


మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. జూలై 6వ తేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

మచిలీపట్నం 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మోకా భాస్కరరావు జూన్ 29న పట్టణంలోని చేపల మార్కెట్‌కు వెళ్లి అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై వెనుదిరిగారు. అదే సమయంలో ఆయనపై దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. గుండెల్లో పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయన్ను ఆటోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కొల్లు రవీంద్రను మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ4 నిందితుడిగా చేర్చారు. ఈ కారణంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద జూలై 3న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోనే రాబోయే 28 రోజుల పాటు ఉండాలని ఆదేశించింది.

Tags :
|
|

Advertisement