జీహెచ్ఎంసీకి పారదర్శకంగా అవినీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం: సీఎం కేసీఆర్
By: chandrasekar Tue, 24 Nov 2020 10:26 AM
హైదరాబాద్ మునిసిపల్ కు
పారదర్శకంగా అవినీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం తీసుకురానున్నట్లు సీఎం
కేసీఆర్ తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీకి సమగ్రమైన చట్టం
తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పూర్తిస్థాయిలో అద్భుతంగా, అన్ని
రకాల పారదర్శకంగా ఉండేలా, అవినీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం తేస్తామని
ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ ఇప్పటికే
తీసుకువచ్చిన టీఎస్ బీపాస్, నూతన రెవెన్యూ చట్టం వంటి పదునైన చట్టాలను తెచ్చామని, క్రమంలోనే నగర అభివృద్ధికి ఊతమిచ్చేలా కొత్త చట్టంలో
నిబంధనలు పొందుపరుస్తామన్నారు. ధరణిపై చాలా మందికి అనేక అనుమానాలుండేవని టీఆర్ఎస్
తీసుకువచ్చిన కార్యక్రమాలన్నీ యావత్
దేశమే ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు.
ప్రస్తుతం మిషన్ భగరీథ, 24గంటల
కరెంటు, సాగునీటి
రంగంపై ఎవరికీ నమ్మకం లేదని వాటిన్నంటినీ అమలు చేసి చూపామన్నారు. దేశ చరిత్రలో ఏ
రాష్ట్రం కూడా సాధించనంత వేగంగా అనితర
సాధ్యంగా, అనన్యసామాన్యంగా
వాటన్నింటినీ నిజాలు చేసి ప్రజల అనుభవంలోకి టీఆర్ఎస్ తీసుకువచ్చిందన్నారు.