ఇండ్ల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి
By: chandrasekar Thu, 08 Oct 2020 1:29 PM
బుధవారం మున్సిపల్
కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలసి
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పాల్గొన్నారు. ధరణి వెబ్సైట్లో సంబంధిత
ఇండ్ల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి
సూచించారు. ఇంటి యజమానితో పాటు వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఇంటి
కొలతలను అప్లోడ్ చేయాలన్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి
నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కలెక్టర్కు విన్నవించారు. మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్
చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్
కమిషనర్ ఆకుల వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ భారతీ హోళికేరి
బుధవారం మండల కేంద్రంలో ఇంటింటి వివరాల
నమోదు సర్వేను పరిశీలించారు. వివరాలను స్థానిక అధికారుల నుంచి అడిగి
తెలుసుకున్నారు. యాప్లో పొందుపర్చే విధానాన్ని పరిశీలించి, ఒక
ఇంటి యజమాని ఫొటో, వివరాలను స్వయంగా కలెక్టర్ నమోదు చేశారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం రైతు వేదిక నిర్మాణాన్ని సందర్శించారు. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని
సూచించారు. జడ్పీటీసీ సత్యనారాయణ, తహసీల్దార్ షరీఫ్, ఎంపీడీవో శంకరమ్మ, సర్పంచ్
సురేఖ, రాజయ్య, కార్యదర్శి
అభిలాష్, సిబ్బంది
ఉన్నారు.