Advertisement

  • అన్నదాతల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా రూ.లక్ష వరకు పరిహారం

అన్నదాతల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా రూ.లక్ష వరకు పరిహారం

By: chandrasekar Fri, 14 Aug 2020 4:24 PM

అన్నదాతల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా రూ.లక్ష వరకు పరిహారం


అన్నదాతల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా రూ.లక్ష వరకు పరిహారం చెలించే కొత్త పధకం తీసికువచ్చారు. రైతుల కోసం కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. అకాల వర్షాలు, కరవు, వరదల కారణంగా పంట నష్టం వాటిలితే వారికి ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వారికి పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు. గుజరాత్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. ఈ పధకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

వర్షాకాలంలో నష్టాలూ కలగకుండా గుజరాత్ ప్రభుత్వం కిసాన్ సహాయ యోజన పేరుతో రైతుల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్‌కు బదులుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అన్నదాతలకు అందిస్తోంది. ఖరీఫ్ పంటకు సంబంధించి 56 లక్షల మంది రైతులకు కొత్త స్కీమ్ ద్వారా ప్రయోజనం కల్పిస్తామని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు.

దేశంలో జూన్ నుంచి నవంబర్ మధ్యకాలంలో వరదలు, అకాల వర్షాలు కారణంగా పంట దెబ్బతింటే రైతులకు పరిహారం అందిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పరిహారం కోసం రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష వరకు పరిహారం అందిస్తామని తెలిపింది. ఏకరాకు రూ.25 వరకు పరిహారం లభిస్తుందని పేర్కొంది.

పంట బీమా కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఏడాది ఎక్కువగా డిమాండ్ చేశాయని, వారి ప్రతిపాదనను అంగీకరిస్తే ప్రభుత్వం ఆ కంపెనీలకు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందుకే వారి ప్రతిపాదనను తిరస్కరించామని, కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించింది. కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకువస్తామని, దీని ద్వారా రైతులు పథకంలో చేరొచ్చని పేర్కొంది. ఈ పధకంలో చేరిన రైతులు అధిక వర్షాలు మరియు వరదల వల్ల నష్టాన్ని చవిచూడకుండా వీలవుతుందని తెలిపారు.

Tags :
|
|

Advertisement