భారత్ మరియు చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు ఈనెల 12న
By: chandrasekar Mon, 05 Oct 2020 3:18 PM
భారత్ మరియు చైనా మధ్య
కమాండర్ స్థాయి చర్చలు ఈనెల 12న జరగనున్నాయి. ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి
ఎక్కువ మొత్తంలో సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతల
నేపథ్యంలో భారత్-చైనా మధ్య మరోసారి కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి.
ఈనెల 12న
తూర్పు లఢక్ సెక్టార్ ప్రాంతంలో ఈ చర్చలు జరుగుతాయని ఆర్మీవర్గాలు తెలిపాయి.
సైనిక మోహరింపుపై ఈ సందర్భంగా
ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై అధికారులు చర్చించే అకాశం
ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆరుసార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.
గత జూన్ నెలలో లఢక్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ
చోటుచేసుకున్న విషయం తెలిసింది. ఈసందర్భంగా చైనా బలగాలు భారత సైనికులపై
రాడ్లు, కత్తులతో
విచక్షణా రహితంగా దాడిచేశారు.
భారత్ ఊహించని రీతిలో
చోటుచేసుకున్న ఈ దాడిలో మన 20 మంది సైనికులు మృతిచెందారు. అప్పటినుంచి భారత్, చైనా మధ్య
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సరిహద్దుల
వెంబడి భారీగా సైన్యాలు, అత్యధునిక ఆయుదాలను చైనా మోహరిస్తూ వస్తున్నది.
ఈ పరిస్థితులను నివారించడానికి ఇరుదేశాల సైనికాధికారులు పలువిడతలుగా సమావేశమయ్యారు.
చైనా తమ సైన్యాన్ని వెనుకకు తీసుకోవడంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.