Advertisement

  • త్వరలో జియో నుండి రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌?

త్వరలో జియో నుండి రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌?

By: chandrasekar Mon, 19 Oct 2020 09:57 AM

త్వరలో జియో నుండి రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌?


త్వరలో జియో నుండి రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌ రానున్నట్లు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంతకుమునుపు జియో తక్కువ ధరలో మొబైల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్ టెలికాం రంగంలో ‘రిలయన్స్ జియో’ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. త్వరలోనే ఈ సంస్థ మరో సంచలనానికి నాంది పలకనుంది. సుమారు రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

దేశంలోని 2జీ వినియోగదారులను ఆకర్షించుటకు రూ. 5 వేలలోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో యోచిస్తోందని కానీ సేల్స్‌ను బట్టి రూ. 2,500 నుంచి రూ. 3,000 లోపే దాన్ని విక్రయించాలని అనుకుంటోందని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై జియో నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం దేశంలో 4జీ విషయంలో టెలికాం రంగాన్ని ఏలుతున్న రిలయన్స్ జియో సుమారు 20-30 కోట్ల మంది 2జీ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన కంపెనీ మీటింగ్‌లో కూడా ‘2జీ ముక్త్ భారత్’ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న సంగతి విదితమే.

Tags :

Advertisement