హార్దిక్ పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడన్న కోచ్ రవిశాస్త్రి
By: chandrasekar Sat, 12 Dec 2020 11:22 AM
ఆస్ట్రేలియా టూర్ లో టీం
ఇండియా t20
సిరీస్ గెలుపొందడంతో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక ఒన్డే సిరీస్ లో మొదటి రెండు
మ్యాచ్ లలో ఒడి చివరి మ్యాచ్ల్లో గెలుపును నమోదు చేసింది. ఇక్కడ జరిగిన వన్డే, టీ20
సిరీస్లో అద్భుతంగా రాణించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టెస్ట్
జట్టులో ఆడడం లేదు. ఆసీస్తో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్లో టీమిండియా విజయాల్లో
హార్దిక్ పాండ్యా మరియు నటరాజన్ కీలక పాత్ర పోషించారు. కచ్చితంగా గెలవాల్సిన
మూడో వన్డేలో చెలరేగి ఆడిన పాండ్యా 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక
సిక్స్తో 92 పరుగులు సాధించి అట్టే ఆకట్టుకున్నాడు.
దీంతో పాండ్య తన వన్డే
కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఇక వన్డే సిరీస్లో అతను మొత్తంగా 210 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్ టీ20లోనూ
అదే జోరును కొనసాగించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. టీం లో కొత్త గా
చేరిన లెఫ్టార్మ్ ఫాస్ట్బౌలర్ నటరాజన్ అరంగేట్రంలో రెండు వికెట్లు తీసి తన
సత్తాను టీంకు చాటాడు. అదే విధంగా టీ20
సిరీస్లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శనతో అందరి చేతా 'నట్టూ' ప్రశంసలు
అందుకుంటున్నాడు. t20 ముగిసిన
తరువాత పాండ్యా సైతం తన దృష్టిలో మ్యాన్
ఆఫ్ ది సిరీస్కు నటరాజన్ అర్హుడంటూ అభిమానం చాటుకున్న సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరి ప్రదర్శనపై
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ప్రశంసలు
వర్షం కురిపించాడు. రోహిత్ మరియు బుమ్రా
లేకుండా టీ20 సిరీస్ గెలవడమనేది అతి పెద్ద విజయంగా భావించాల్సి
ఉంటుంది జట్టు మొత్తం ఎంతో బాధ్యతగా ఆడింది అని పొగిడాడు. ముఖ్యంగా హార్దిక్
పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడి తర్వాతే ఎవరైనా అంటూ ఈ సిరీస్లో బంతిని అత్యంత అద్భుతంగా స్ట్రైక్
చేసింది అతడే అని పాండ్యని కొనియాడాడు. అలాగే నటరాజన్ గురించి మాట్లాడుతూ తనను
నెట్ బౌలర్గా తీసుకున్నాం. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో నటరాజన్
సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అతడిపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్మెంట్కే ఆ
క్రెడిట్ అంతా దక్కుతుందని చెప్పాడు.
తనలో విశ్వాసం నింపిన విధానం అమోఘం. తన సుదీర్ఘ ప్రయాణానికి ఇదో మంచి ఆరంభం
అని రవిశాస్త్రి కొనియాడాడు. ఇక రానున్న టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా విజయం
సాదిస్తుందని భావిస్తాం.