కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
By: chandrasekar Wed, 23 Sept 2020 10:43 AM
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్
మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్రంలోని కీలక విషయాలు చర్చించుటకు సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కలిసి పలు కీలక
విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న షా ఆరోగ్య పరిస్థితి
గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి
నిశితంగా సీఎం వివరించారు.
ఏపీ రాష్ట్ర అభివృద్ధి
గురుంచి మరియు ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానాలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పలు విషయాలపై ఇరువురి
మధ్య చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్
నెట్ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను కూడా సీఎం జగన్ అమిత్ షా దృష్టికి
తీసుకెళ్లారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్
అంశాలపై అమిత్ షాకు విజ్ఞాపన పత్రాన్ని జగన్ అందజేశారు. జగన్ వెంట ఎంపీలు
విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, బాలశౌరి ఉన్నారు. రాష్ట్రానికి అందాల్సిన నిధులపై
కూడా చర్చించనున్నారు.