ఉద్యమకారులకు కెసిఆర్ అన్యాయం చేయరు ..గుత్తా సుఖేందర్ రెడ్డి
By: Sankar Mon, 31 Aug 2020 4:26 PM
ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేయరని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలి చైర్మన్గా రాజ్యాంగ పదవిలో సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగానే ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ అన్ని పదవులకు సమర్థుడేనని చెప్పారు. సీఎం తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందనే విషయంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. సభలో 4 బిల్లులు చర్చకు వస్తాయని తెలిపారు. మండలిలో కొత్తగా 8 సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
కాగా తెరాస లో సీనియర్ నాయకుడుం అయిన స్వామి గౌడ్ పార్టీలో ఉద్యమకారులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని వ్యాఖ్యానించిన ఇషయం తెలిసిందే..ఉద్యమం అప్పటి నుంచి పార్టీని అంటి పెట్టుకున్న వారికీ సరైన గుర్తింపు దక్కడం లేదు అని , సీఎం కెసిఆర్ , మంత్రి కేటీఆర్ ల అప్పోయింట్మెంట్ కూడా దొరకడం లేదు అని స్వామి గౌడ్ వ్యాఖ్యానించారు