సిద్ధిపేట లేకపోతే కెసిఆర్ లేడు ...సిద్ధిపేట పర్యటనలో కెసిఆర్ వ్యాఖ్యలు
By: Sankar Thu, 10 Dec 2020 10:20 PM
సిద్దిపేట జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా గురువారం ఆయన మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఆనంతరం జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జిల్లాకు మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అన్నారు. హరీష్ సారథ్యంలో సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, సిద్దిపేటను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు..ఇక హరీశ్ను ప్రశంసల్లో ముంచెత్తారు. సిద్దిపేట నుంచి వెళ్లి తెలంగాణ సాధించా. సాధించి ప్రజల చేతుల్లో పెట్టా.
తెలంగాణకే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీశ్రావుని మీకు అప్పగించా. సిద్దిపేట అభివృద్ధి చూస్తుంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హరీశ్ నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. తన గుండెల్నిండా సంతోషం నిండి ఉందని సీఎం అన్నారు.