Advertisement

  • అమర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం సూర్యాపేట రానున్న సీఎం కెసిఆర్

అమర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం సూర్యాపేట రానున్న సీఎం కెసిఆర్

By: Sankar Sun, 21 June 2020 4:36 PM

అమర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం సూర్యాపేట రానున్న సీఎం కెసిఆర్



దేశ రక్షణలో అమరుడైన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే..సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని కూడా సీఎం తెలిపారు ..అయితే సీఎం కెసిఆర్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం రోజు సూర్యాపేట రానున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ..

శనివారం సాయంత్రం జగదీష్ రెడ్డి ,సునీత దంపతులు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వివరాలను సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ బాబు సేవలకు గుర్తుగా యువతకు స్ఫూర్తిగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.

సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు రూ.5 కోట్ల పరిహారం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని.. ఇంటి స్థలం అందజేస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. గాల్వన్ ఘర్షణల్లో అమరులైన మిగతా జవాన్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.అయితే ఇంటి స్థలం విషయంలో వారు సూర్యాపేటలో కోరుకుంటే సూర్యాపేటలో లేదా హైదరాబాద్లో కావాలంటే హైద్రాబాద్లో ఇలా వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటె అక్కడ తీసుకోవచు అని కెసిఆర్ తేలిపారు అని జగదీష్ రెడ్డి సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో చెప్పారు ..వారు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించారని జగదీష్ రెడ్డి అన్నారు

Tags :
|
|
|
|

Advertisement