Advertisement

  • నేడే ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం కెసిఆర్

నేడే ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం కెసిఆర్

By: Sankar Thu, 29 Oct 2020 07:47 AM

నేడే ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం కెసిఆర్


రాష్ట్రంలో గురువారం నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో ఇదో మైలురాయిగా నిలవనుంది. ధరణి ద్వారా ఇకపై తహసీల్దారు కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందనున్నాయి. దస్తావేజుల రాతకోతలు అవసరం లేని ఈ విధమైన సేవలు మరే రాష్ట్రంలోనూ లేవు.

సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్నారు. ధరణి సేవలు అందుబాటులోకి వస్తే... ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న దస్త్రాలనిర్వహణ ఇకపై పోర్టల్‌లో డిజిటల్ రూపంలో కొనసాగుతోంది. భూమి యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పు చేర్పులకు వీలుండదు. యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు జరుగుతాయి.

యజమాని సెల్‌ఫోన్‌కు పంపే ఓటీపీ ఆధారంగానే ఈ మార్పులు జరుగుతాయి. అక్రమంగా భూ యాజమాన్య హక్కులు మార్చడం వంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. అంతేకాదు వేలి ముద్రతోనే (బయోమెట్రిక్‌) దస్త్రాలు తెరుచుకుంటాయి.అంతేకాదు రిజిస్ట్రేషన్లు.. మ్యుటేషన్ల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.

రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల సేవలను ఒకే సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచింది. దీనివల్ల వ్యవసాయ భూములను మండల తహసీల్దారు కార్యాలయాల్లోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. గతంలో భూమిపై యాజమాన్య హక్కులు పొందాలంటే మ్యుటేషన్‌ కోసం గ్రామస్థాయిలో వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు పలుమార్లు తిరిగితే తప్ప పూర్తయ్యేదికాదు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ కూడా పూర్తయిపోతుంది.

Tags :
|
|
|

Advertisement