రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కెసిఆర్ ..ఈ నెల 27 నుంచి రైతు బంధు పంపిణీ
By: Sankar Mon, 07 Dec 2020 8:53 PM
రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి వచ్చేనెల 7వరకు రైతుబంధు సహాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) నిర్ణయించారు. . రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను కేసీఆర్ ఆదేశించారు.
రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బు జమ చేయాలని తెలిపారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు..
Tags :
cm kcr |