Advertisement

గవర్నర్ తమిళసై ని పరామర్శించిన సీఎం కెసిఆర్

By: Sankar Sat, 29 Aug 2020 10:42 PM

గవర్నర్ తమిళసై ని పరామర్శించిన సీఎం కెసిఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. గవర్నర్‌ను కేసీఆర్ పరామర్శించేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

తమిళిసై చిన్నాన్న వసంత్‌కుమార్‌ శుక్రవారం మరణించారు. గవర్నర్‌ తండ్రి అనంతన్‌ కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసీఆర్‌ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. తండ్రి ఆరోగ్యం గురించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ను అడిగి తెలుసుకున్నారు.

సెప్టెంబర్ 7 నుంచి 20 రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా సీఎం కేసీఆర్ గవర్నర్‌ మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిమని, సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి గవర్నర్ తమిళిసైకి వివరించినట్లు సమాచారం.


Tags :
|
|
|

Advertisement