- హోమ్›
- వార్తలు›
- అర్హత ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తాము....సింగరేణి కారుణ్య నియామకాలపై సీఎం కెసిఆర్
అర్హత ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తాము....సింగరేణి కారుణ్య నియామకాలపై సీఎం కెసిఆర్
By: Sankar Mon, 14 Sept 2020 11:17 AM
సింగరేణిలో కారుణ్య నియామకాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసనసభ వేదికగా స్పందించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నల సందర్భంగా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
అర్హత ఉన్న వారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తాం. చదువుకు సమాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు నియమిస్తాం. పోస్టులు సృష్టించి ఇవ్వబడవు అని స్పష్టం చేశారు. సంస్థ మంచి, చెడులు వారికి తెలియాలి. ఈ క్రమంలో వారిని తక్షణమే జనరల్ మజ్దూర్ గా తీసుకుంటాం. కొద్ది రోజులు వారికి శిక్షణ ఇచ్చి అప్గ్రేడ్ చేసి పోస్టులోకి తీసుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు ఇన్కం ట్యాక్స్ రద్దు చేయాలని ప్రధాని మోదీని అనేకసార్లు కోరామని తెలిపారు. కేంద్రం పట్టించుకోవడం లేదు.
సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రిటైర్ అయిన సింగరేణి కార్మికులను గౌరవించాలి. పదవీ విరమణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌరవంగా పంపాలి అని సీఎం సూచించారు. కారుణ్య నియామకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సీఎం స్పష్టం చేశారు.