Advertisement

గవర్నర్ తో భేటీ అయిన సీఎం కెసిఆర్

By: Sankar Mon, 20 July 2020 5:03 PM

గవర్నర్ తో భేటీ అయిన సీఎం కెసిఆర్



తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు...ఆదివారం ప్రధాని మోదీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. ఆ మరుసటి రోజే గవర్నర్‌తో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారని సమాచారం

కరోనా పెరుగుతున్న తీరు... కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం అందిస్తోన్న వైద్యం తదితర అంశాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశంపైనా కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ చాలా రోజులపాటు కరోనాపై సమీక్షలు నిర్వహించలేదు. దీంతో గవర్నర్ స్వయంగా రంగంలోకి దిగారు. చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ వారు హాజరు కాలేదు. దీంతో గవర్నర్ ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో భేటీ నిర్వహించారు.


Tags :
|
|

Advertisement