కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్న సీఎం కేసీఆర్
By: chandrasekar Thu, 28 May 2020 3:30 PM
లాక్ డౌన్ నిబంధనలు
సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని ఐనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని అంచనాల ప్రకారం
రాబోయే రెండు మూడు నెలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగతాయని కేసుల సంఖ్య
పెరిగినప్పటికీ, తగిన
వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య
శాఖ సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా బాధితులకు చికత్స
అవసరం లేదని చెప్పారు సీఎం కేసీఆర్. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా
క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆయన కోరారు.
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్
డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష
నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు, వైద్య
నిపుణులు, కోవిడ్ -19
విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాష్ట్ర స్థాయి
కమిటీ ముఖ్యమంత్రి, మంత్రులకు
ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
కరోనా విషయంలో అంతగా
భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి
అర్థమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ
ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం
వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వారికి
ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదు. 15 శాతం
మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము
లాంటి ఐఎల్ఐ లక్షణాలు కనిపిస్తాయి. ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారు.
మిగతా 5 శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే
సారి లక్షణాలు కనిపిస్తాయి. ఈ 5 శాతం
మంది విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరిలోనే మరణించే వారు ఎక్కువ
ఉంటారు.
భారతదేశంలో 2.86 శాతం, తెలంగాణలో
2.82 శాతం మరణాల రేటు ఉంది. వారు కూడా ఇతర సీరియస్
జబ్బులు ఉన్న వారే. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజల కదలిక పెరిగింది. ఒక
ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ మార్గాల ద్వారా రాకపోకలు పెరిగాయి.
అయినప్పటికీ వైరస్ ఉన్నట్లుండి ఉధృతంగా వ్యాప్తి చెందలేదు. ఇది మంచి పరిణామం. ’’ అని
వైద్యాధికారులు, నిపుణులు
చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత
జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ
అప్రమత్తంగా ఉండాలని సూచించారు.