Advertisement

  • కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు

కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు

By: chandrasekar Tue, 23 June 2020 11:13 AM

కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు


రాష్ట్రవ్యాప్తంగా ‘104’ వాహనాల ద్వారా ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సోమవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ‘104’ వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్స్ సేకరించాలన్నారు.

షుగర్‌, బీపీ లాంటి వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులివ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలన్నారు. ‘104’ సిబ్బందితో పాటు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లను అనుసంధానం చేసి ప్రతి నెలలో ఒక రోజు తప్పనిసరిగా ఒక గ్రామానికి ‘104’ వాహనం వెళ్లాలన్నారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం జగన్ సూచించారు.

కంటైన్మెంట్‌ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్ 19‌ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి సైతం కోవిడ్‌ పరీక్షలు చేయాలన్నారు. అలాగే వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. లోకల్‌ ప్రోటోకాల్‌ రూపొందించి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్‌వోపీని ఆ ఇంటికి తెలియజేయాలన్నారు. అలాగే టెలిఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.

రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ కరోనాపై అవగాహన కల్పించి, నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలన్నారు.

కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలని అందులో ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచాలని స్పష్టం చేశారు.

Tags :
|

Advertisement