Advertisement

  • ఏపీ లో ట్యూషన్ ఫీజుపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఏపీ లో ట్యూషన్ ఫీజుపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

By: chandrasekar Sat, 31 Oct 2020 09:22 AM

ఏపీ లో ట్యూషన్ ఫీజుపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థుల తల్లి దండ్రులకు జగన్ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30 శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ కారణంగా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ఈ తరుణంలో విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందువల్ల తల్లిదండ్రులకు కొంత ఊరటనిస్తోంది.

దీనిని తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌కు క్లాస్‌లు ప్రారంభం కాబోతున్నాయి. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతు‌లు ప్రారంభంకానున్నాయి . రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వల్ల పలు మార్లు వాయిదా పడ్డ పాఠశాలలు ఈ సారి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement