ఢిల్లీలో స్కూళ్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేత...
By: chandrasekar Thu, 29 Oct 2020 6:37 PM
కరోనా నేపథ్యంలో
ఢిల్లీలో స్కూళ్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర
డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ శిసోడియా తెలిపారు. రెగ్యులర్గా
క్లాసులు నిర్వహించేందుకు విద్యార్థులు తల్లితండ్రులు ఆసక్తిగా లేరని ఆయన
పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయనున్నట్లు ఆయన
చెప్పారు. దేశరాజధానిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం
ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మంగళవారం ఢిల్లీలో
కొత్తగా 4853 కేసులు నమోదు కావడంతో నగర ప్రజలు భయాందోళనలకు
గురవుతున్నారు. మరోవైపు శీతాకాలం సమీపిస్తున్న
తరుణంలో నగర కాలుష్యం కూడా ఎక్కువైంది. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు
ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు
స్కూళ్లను మూసి వేయాలంటూ అంటూ ఢిల్లీ సర్కార్ ఆదేశించింది. ఐపీ యూనివర్సిటీ
కింద ఉన్న కాలేజీల్లో సీట్ల సంఖ్య 1330కి పెంచినట్లు మంత్రి శిసోడియా తెలిపారు.