సివిల్స్ అధికారి వినూత్న ఆలోచన...ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డుకు శ్రీకారం...
By: chandrasekar Mon, 23 Nov 2020 7:09 PM
ఓ యువ ఐఆర్టీఎస్(సివిల్స్)
అధికారి..జీవితంలో మధురఘట్టాన్ని ఆరంభించే క్రమంలో వినూత్న ఆలోచనతో పర్యావరణ
పరిరక్షణకు ముందడుగేశారు. కూరగాయలు, పూల విత్తనాలతో పెండ్లి పత్రికను తయారు చేయించి
వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఈ వెడ్డింగ్ కార్డును
నీళ్లలో నానబెట్టి మట్టిలో వేస్తే అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. రంగారెడ్డి
జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసు
అధికారి శశికాంత్.. విత్తనాలతో మిళితమైన వివాహ ఆహ్వాన పత్రికను ఆగ్రాలోని ఓ
స్టార్టప్ సంస్థ ద్వారా తయారు చేయించారు.
ఈ కార్డుల్లో బెండ, టమాట, పచ్చిమిర్చితోపాటు
చామంతి, బంతి, లిల్లి
విత్తనాలను ఉంచారు. సైబరాబాద్ పోలీసు
కమిషనర్ సజ్జనార్ను కలిసిన శశికాంత్ తన పెండ్లికి రావాలని ఈకో-ఫ్రెండ్లీ
వెడ్డింగ్ కార్డును అందజేశారు.
ఈ కార్డు ప్రత్యేకతను
తెలుసుకున్న సజ్జనార్.. శశికాంత్ను అభినందించారు. చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే
ఇష్టమనీ, తనవంతుగా
పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డుకు శ్రీకారం
చుట్టానని శశికాంత్ చెప్పారు.