- హోమ్›
- వార్తలు›
- హీరో రాజశేఖర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఆసుపత్రి వర్గాలు ..ఐసీయూ లోనే ఉన్నట్లు వెల్లడి
హీరో రాజశేఖర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఆసుపత్రి వర్గాలు ..ఐసీయూ లోనే ఉన్నట్లు వెల్లడి
By: Sankar Tue, 27 Oct 2020 7:27 PM
ఇటీవలే కరోనా సోకిన సీనియర్ హీరో రాజశేఖర్ అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు.
గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా (మంగళవారం) ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. మెల్లగా రాజశేఖర్ ఆరోగ్యం కుదుట పడుతోందని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఐసీయూలోనే రాజశేఖర్కి చికిత్స అందిస్తున్నామని, ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ తొలగించామని, ప్లాస్మా థెరపీతో పాటు సైటోసోర్బ్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని తాజా బులెటిన్లో పేర్కొన్నారు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు.