Advertisement

కర్ణాటకలో యువ పోలీస్ అధికారిని ఆత్మహత్య

By: Sankar Thu, 17 Dec 2020 4:53 PM

కర్ణాటకలో యువ పోలీస్ అధికారిని ఆత్మహత్య


బెంగుళూరు లో యువ పోలీస్ అధికారిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది ..వివరాల్లోకి వెళ్తే బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధ‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లాన‌కి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మి.. 2017లో విధులలో నియ‌మితులయ్యారు.

ల‌క్ష్మిది కోలార్ జిల్లాలోని మ‌లూరు తాలుకా మాస్తి గ్రామం.. ల‌క్ష్మి ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగ‌ళూరులోని అన్న‌పూర్నేశ్వ‌రి న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో డీఎస్పీగా ప‌ని చేస్తున్నారు.అయితే, త‌న స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన ల‌క్ష్మి.. అక్క‌డ గ‌దిలోకి వెళ్లి ఎంత‌కి బ‌య‌ట‌కు రానందున త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి చూశారు.. కానీ, ల‌క్ష్మి అప్ప‌టికే ఉరివేసుకుని ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వెంట‌నే కిందికి దించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించిన‌ట్లు వెల్ల‌డించారు

Tags :

Advertisement