నంద్యాల కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ అరెస్ట్...
By: Sankar Sun, 08 Nov 2020 7:57 PM
నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తును పోలీస్ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సీఐ సోమశేఖర్రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తప్పు చేస్తే ఎంతటివారినైనా వదిలిపెట్లే ప్రసక్తే లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. మరోవైపు ఐజీ శంకబ్రతబాగ్జి, ఐపీఎస్ అధికారి అరిఫ్ అఫీజ్ కేసు విచారణను ప్రారంభించారు.
కాగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది ..
దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్టౌన్ సీఐ సోమశేఖర్ను సస్పెండ్ చేశారు