- హోమ్›
- వార్తలు›
- అమెరికా ప్రతినిధి తైవాన్ సందర్శనతో 'నిప్పుతో చెలగాటం ఆడొద్దని' అమెరికాను హెచ్చరించిన చైనా
అమెరికా ప్రతినిధి తైవాన్ సందర్శనతో 'నిప్పుతో చెలగాటం ఆడొద్దని' అమెరికాను హెచ్చరించిన చైనా
By: chandrasekar Thu, 13 Aug 2020 05:52 AM
అమెరికా మరియు చైనాల మధ్య
కోల్డ్ వార్ జరిగే విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, చైనా
మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది. ‘నిప్పుతో చెలగాటం ఆడొద్దు’ అని అమెరికాను చైనా
హెచ్చరించింది. అమెరికా ప్రతినిధులు ఇటీవల తైవాన్ను సందర్శించడంపై డ్రాగన్ ఈ
వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆరోగ్య విభాగ చీఫ్ అలెక్స్ అజర్ ఇటీవల తైవాన్లో
మూడు రోజుల పాటు పర్యటించారు.
అమెరికా ప్రతినిధి
అలెక్స్ అజర్ పర్యటనలో భాగంగా కరోనా వైరస్ విషయంలో చైనా తీరుపై ఆయన విమర్శలు
చేశారు. అజర్ పర్యటనపై చైనా ప్రతినిధి బుధవారం, ఆగస్టు 12
స్పందించారు. తైవాన్, అమెరికా మధ్య అధికారుల రాకపోకలను చైనా
వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
చైనా విషయంలో అమెరికా కలిగించుకోవడం వల్ల చైనా తీవ్రంగా స్పందించింది.
చైనాకు సంబంధించిన
వ్యవహారాల్లో అమెరికా అనవసరంగా తలదూరుస్తోంది. లేని భ్రాంతులను సృష్టిస్తోంది.
నిప్పుతో చెలగాటం ఆడితే కాలుతుంది అని లిజాయన్ పేర్కొన్నారు. ఎవరికో బానిసలుగా
ఉండొద్దు విదేశీయుల మద్దతుపై ఆధారపడి స్వతంత్రం కోసం ఆరాటపడితే అది ముగింపే
అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ అది పత్యం కోసం ఇరు దేశాలు పోటీపడుతున్న
వేల అమెరికా చర్యలపై చైనా మరింతగా హెచ్చరించింది.