Advertisement

  • భారత్ నుంచి చైనా బియ్యం‌‌ను కొనుగోలు చేయను౦ది...

భారత్ నుంచి చైనా బియ్యం‌‌ను కొనుగోలు చేయను౦ది...

By: chandrasekar Thu, 03 Dec 2020 11:04 AM

భారత్ నుంచి చైనా బియ్యం‌‌ను కొనుగోలు చేయను౦ది...


భారత్-చైనా సంబంధాల్లో తూర్పు లడఖ్‌‌లో ఉద్రికత్తల కారణంగా ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇలాంటి సమయంలో భారత్ నుంచి బియ్యం‌‌ను కొనుగోలు చేయాలని చైనా నిర్ణయించిందని సమాచారం. బియ్యం సరఫరా కష్టతరమవడంతోపాటు డిస్కౌంట్ ధరలకు అమ్మడానికి ససేమిరా అనడంతో చాన్నాళ్లుగా భారత్ నుంచి రైస్‌‌ను చైనా కొనుగోలు చేయడం లేదు.

మూడు దశాబ్దాల్లో భారత్ నుంచి రైస్‌‌ను చైనా దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి కానుంది. ప్రపంచంలో అత్యధికంగా బియ్యంను ఎగుమతి చేసే దేశంగా భారత్‌కు పేరుంది. అదే సమయంలో వరల్డ్‌‌లో బియ్యం‌‌ను ఎక్కువగా దిగుమతి చేసుకునే కంట్రీగా చైనాను చెప్పొచ్చు.

‘తొలిసారి చైనా మన దగ్గర నుంచి బియ్యం‌‌ను కొనుగోలు చేస్తోంది. భారత వరి క్వాలిటీని చూశాక వచ్చే ఏడాది చైనా మరింతగా రైస్‌‌ను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి’ అని రైస్ ఎక్స్‌‌పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీ కృష్ణా రావు తెలిపారు. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో లక్ష టన్నుల బియ్యం‌‌ను ఎగుమతికి భారత ట్రేడర్లతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి టన్నుకు దాదాపుగా రూ.21,900 చెల్లించనున్నట్లు సమాచారం. చైనా మామూలుగా థాయ్‌‌లాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్‌‌ల నుంచి బియ్యం‌‌ను కొనుగోలు చేస్తుంది.

Tags :
|
|
|
|

Advertisement