సరిహద్దులో మరొక ఎత్తుగడ వేస్తున్న చైనా...
By: chandrasekar Tue, 10 Nov 2020 4:51 PM
సరిహద్దులో చైనా రోడ్డు
నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని
కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా
వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది.
ఈ ప్రాంతంలో 2017లో
చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని
చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు
పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
శీతాకాలంలో ఈ మార్గం అంతా
మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా
సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు.
డోక్లాం పీఠభూమి తమ
భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్కి
మద్దతిస్తోంది.