Advertisement

  • నవంబర్ నాటికి సాధారణ ప్రజల అందుబాటులోకి చైనా కరోనా వాక్సిన్

నవంబర్ నాటికి సాధారణ ప్రజల అందుబాటులోకి చైనా కరోనా వాక్సిన్

By: chandrasekar Wed, 16 Sept 2020 10:28 AM

నవంబర్ నాటికి సాధారణ ప్రజల అందుబాటులోకి చైనా కరోనా వాక్సిన్


ఈ సంవత్సరం నవంబర్ నాటికి సాధారణ ప్రజల అందుబాటులోకి చైనా కరోనా వాక్సిన్ రానున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది. కరోనా వైరస్ కట్టడికి అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఆస్ట్రాజెనెకా, మోడెర్నా మరియు ఫైజర్ వంటి కంపెనీల వ్యాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉండగా రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్టర్ చేసేసింది. రష్యా వ్యాక్సిన్ కూడా ఈ వారంలో మార్కెట్లో అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తికాగానే ఈ వాక్సిన్ లు విడుదల కానున్నాయి.

వూహన్ లో పుట్టిన ఈ వైరస్ కు వాక్సిన్ ను చైనాలోనే తాయారు చేసి అందుబాటులోకి రానుంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఏకంగా నాలుగు వ్యాక్సిన్ లు తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నాలుగు వ్యాక్సిన్ లను నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నట్టు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఈ నాలుగు వ్యాక్సిన్ లలో మూడింటిని ఇప్పటికే అత్యవసరసేవల్లో ఉన్నవారికి ఇచ్చారు. జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఇప్పటివరకూ ఎటువంటి అసాధారణ లక్షణాలు నమోదు కాలేదని సీడీసీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా పై అన్ని దేశాలు చాలా విముకతతో వుంది. కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన చైనా వాక్సిన్ ఎంతవరకు సహాయపడుతుందో వేచి చూడాలి మారి. ఈ వాక్సిన్ లు తుది దశలో ఉండడం వల్ల త్వరలోనే రావచ్చని చెపుతున్నారు.

Tags :
|
|

Advertisement