ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ పర్యటనపై అక్కసు వెళ్లగక్కిన చైనా
By: Sankar Fri, 03 July 2020 2:30 PM
ప్రధాని నరేంద్ర మోడీ ఎవ్వరికి చెప్పకుండా ఆకస్మికంగా లఢక్ లో పర్యటించడం చర్చనీయాంశం అయింది..భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ , నేపాల్ , చైనా పావులు కదుపుతున్న నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ..ఎప్పుడు భారత్ కు మిత్ర దేశంగా ఉండే నేపాల్ ఒక్కసారిగా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది , ఇదే అదను అనుకోని పాకిస్తాన్ , చైనాలు నేపాల్ ను మరింత రెచ్చగొడుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు..అయితే చైనా యాప్ లను భారత్ నిషేదించనప్పటికీ అందరూ భారత్ కు సపోర్ట్ చేయడం కూడా చైనా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది ..
శుక్రవారం ఉదయం మూడోకంటికి కూడా తెలియకుండా సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో కలిసి మోదీ లద్దాఖ్లోని నిము స్థానిక స్థావరంకు చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 15న గల్వాన్ లోయలో చేసుకున్న హింసాత్మక ఘటనపై గాయపడిన జవాన్లను పరామర్శించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట తాజా పరిస్థితుల గురించి ఆరా తీశారు. మరోవైపు మోదీ లద్దాఖ్ ఆకస్మిక పర్యటనతో చైనాతో పాటు పాకిస్తాన్, నేపాల్కు మోదీ గట్టి సందేశం ఇచ్చారు.