Advertisement

  • యాదాద్రి తిరుగు ప్రయాణంలో కోతులకు అరటిపండ్లు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్

యాదాద్రి తిరుగు ప్రయాణంలో కోతులకు అరటిపండ్లు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్

By: chandrasekar Mon, 14 Sept 2020 09:06 AM

యాదాద్రి తిరుగు ప్రయాణంలో కోతులకు అరటిపండ్లు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్


ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి తిరుగు ప్రయాణంలో కోతులకు అరటిపండ్లు పంచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతను చాటారు. యాదాద్రి తిరుగు ప్రయాణంలో దారి పక్కన కోతులకు సీఎం అరటిపండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపును చూసిన సీఎం కేసీఆర్‌ వాహనం దిగి కోతులకు స్వయంగా అరటిపండ్లు అందజేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ప్రగతి పనులను పరిశీలించేందుకు సీఎం ఆదివారం యాదాద్రికి విచ్చేసిన సంగతి తెలిసిందే.

ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ఆలయ సిబ్బంధి మరియు అర్చకులు ఆహ్వానించారు. ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. తిరుగుప్రయాణంలో ఆకలితో వున్న కోతులకు అరటిపండ్లు ఇచ్చి మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు.

Tags :
|

Advertisement