Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్ ..ఈ రోజు నుంచే సాధన మొదలుపెట్టనున్న ధోని సేన

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్ ..ఈ రోజు నుంచే సాధన మొదలుపెట్టనున్న ధోని సేన

By: Sankar Fri, 04 Sept 2020 2:43 PM

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్ ..ఈ రోజు నుంచే సాధన మొదలుపెట్టనున్న ధోని సేన


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యొక్క అదనపు క్వారంటైన్ ఈ రోజుతో ముగిసింది. అన్ని జట్లతో పాటుగా ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ కి వెళ్లిన సిఎస్కే జట్టులో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కారణంగా ఆ జట్టు మిగిత అన్ని జట్లకంటే ఆరు రోజులు ఎక్కువగా క్వారంటైన్ లో గడపాల్సి వచ్చింది. ఇప్పటివరకు అక్కడికి వెళ్లిన జట్లలో ప్రాక్టీస్ ప్రారంభించని జట్టు కేవలం సిఎస్కే మాత్రమే.

అదనపు క్వారంటైన్ వారికి రెండు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో అందరికి నెగెటివ్ రావడంతో ఆటగాళ్ళు అందరూ బయటికి వచ్చారు. ఆ ఫోటోలను సిఎస్కే యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.ఇక ఈ రోజునుండే సిఎస్కే తమ శిక్షణ ప్రారంభించనుంది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు పేసర్ దీపక్ చాహర్, బ్యాట్స్ మాన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే మిగిలిన సహాయక సిబ్బంది అందరికి వారి 14 రోజుల నిర్బంధం ముగిసిన తర్వాతే కరోనా పరీక్షలు చేస్తారు.

అందులో నెగెటివ్ వచ్చిన తర్వాత ఆ ఆటగాళ్లు ఇద్దరు శిక్షణలో పాల్గొంటారు. ఇక ఈ రోజు బీసీసీఐ ఐపీఎల్ 2020 షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు నిన్న గంగూలీ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా రావడంతో మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎవరు ఆడనున్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతుంది.

Tags :
|
|
|

Advertisement