Advertisement

  • ధోనికి కరోనా నెగటివ్..ఐపీయల్ ఆడేందుకు లైన్ క్లియర్

ధోనికి కరోనా నెగటివ్..ఐపీయల్ ఆడేందుకు లైన్ క్లియర్

By: Sankar Thu, 13 Aug 2020 9:03 PM

ధోనికి కరోనా నెగటివ్..ఐపీయల్ ఆడేందుకు లైన్ క్లియర్



భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కరోనా వైరస్ పరీక్షల రిజల్ట్ గురువారం వచ్చింది. మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన ధోనీ నుంచి బుధవారం శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది.. పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌ వచ్చినట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. దాంతో.. చెన్నైలో శనివారం నుంచి ప్రారంభంకానున్న సీఎస్‌కే క్యాంప్‌నకి ధోనీ హాజరయ్యేందుకు మార్గం సుగుమమైంది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆగస్టు 20 తర్వాతే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు జట్లని అక్కడికి పంపనున్నాయి. అయితే.. యూఏఈకి క్రికెటర్లని పంపే ముందే కనీసం రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు వారికి నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ఫ్రాంఛైజీలకి ఆదేశించింది. దాంతో.. ఆగస్టు 15 నుంచి 21 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకి చెన్నైలో ఓ క్యాంప్‌ని నిర్వహించాలని సీఎస్‌కే ప్లాన్ చేసింది.

ఈ క్యాంప్‌నకి ఆటగాళ్లని ఛార్టర్డ్ ప్లైట్‌లో తరలించనున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. రాంచీలోని ధోనీ కోసం శుక్రవారం ప్లైట్‌ని పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ క్యాంప్‌నకి హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, పీయూస్ చావ్లా, రవీంద్ర జడేజా దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

Tags :
|
|
|
|

Advertisement