చెన్నై క్రికెటర్ గుండెపోటుతో మరణం... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అశ్విన్
By: chandrasekar Wed, 07 Oct 2020 7:06 PM
తమిళనాడు చెందిన స్పిన్నర్
ప్రశాంత్ రాజేశ్ గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం అతని వయసు 35
ఏళ్లు. తమిళనాడు అండర్-19, రంజీ జట్లకు రాజేశ్ ప్రాతినిథ్యం వహించాడు.
అతని మృతి పట్ల భారత
క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా సంఘీభావాన్ని తెలిపారు. "
రాజేశ్ ఇకలేరన్న వార్త నమ్మలేకపోతున్నాను. టీన్పీఎల్లో మ్యాచ్లు ముగిసిన అనంతరం
నీవు నాతో మాట్లడిన మాటలను ఇంకా మర్చిపోలేదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ
దైవాన్ని వేడుకుంటున్నా" అంటూ ట్విట్ చేశాడు.
తమిళనాడు రాష్ట్రం ఎన్నో
ట్రోపీలు ఆడిన రాజేశ్ మరణం పట్ల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్తో పాటు ఆ రాష్ట్ర
వివిధ క్రీడా సంఘాలు కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్
(టీఎన్పీఎల్) లో ఆడిన ప్రశాంత్ రాజేశ్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
తమిళనాడు చెందిన చాలా
క్రికెటర్లు ఇతని సహచారులు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రధాన బౌలర్గా
మారిన టీ నటరాజన్, రాజేశ్ ఒకే జట్టుకు ప్రతినిథ్యం వహించారు.