Advertisement

  • దీపావళి సందర్భంగా కొరడాతో కొట్టించుకున్న ఆ రాష్ట్ర సీఎం

దీపావళి సందర్భంగా కొరడాతో కొట్టించుకున్న ఆ రాష్ట్ర సీఎం

By: Sankar Mon, 16 Nov 2020 06:52 AM

దీపావళి సందర్భంగా కొరడాతో కొట్టించుకున్న ఆ రాష్ట్ర సీఎం


ఛత్తీస్ గడ్ లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం రోజున దీపావళి వేడుకల అనంతరం ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ మరుసటిరోజు తన స్వగ్రామం వెళ్లారు.

దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామానికి వెళ్లిన అయన గోవర్ధన పూజలో పాల్గొన్నారు. ఈ పూజ తరువాత ఆ గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ ముఖ్యమంత్రిని కొరడాతో చేతిపై కొట్టారు. గోవర్ధన పూజ అనంతరం ఆ గ్రామంలో ఇలా చేతిపై కొరడాతో కొట్టించుకోవడం ఆచారం.

ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏడాది సీఎం దీపావళి తరువాత గ్రామానికి వచ్చి ఈ పూజలో పాల్గొని కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా చేయడం వలన మంచి జరుగుతుందని నమ్ముతారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement